రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మధ్య మానేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా సిద్దిపేట వెళ్తున్న బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరిని అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అధికారులు బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.