Murder | గూడూరు, జనవరి 25: కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోబల్తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్తండాకు చెందిన తేజావత్ ఈరమ్మ (58) తండాలో కూలీ పనులు చేస్తూ ఒంటరిగా నివసిస్తున్నది.
ఆమె భర్త చనిపోగా సంతానం లేదు. ఈరమ్మ తన ఇంటి పక్కనే ఉన్న వృద్ధుడు తేజావత్ స్వామికి రూ.500లు చేబదులుగా ఇచ్చింది. తన డబ్బు ఇవ్వాలని మూడు రోజులుగా ఈరమ్మ స్వామిని అడుగుతుంది. ఆమెపై కక్ష పెంచుకున్న స్వామి బుధవారం రాత్రి ఈరమ్మను గొంతునులిమి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి అక్క కుమారుడి ఫిర్యాదు మేరకు స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.