ఆదిలాబాద్ రూరల్, జనవరి 26: గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం అందుకున్న ఓ అధికారి కొద్దిసేపటికే గుండెపోటుతో కన్నుమూశారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం మేనేజర్ చెన్నమనేని దివాకర్రావు (56) శుక్రవారం ఉత్తమ అధికారిగా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే గుండెపోటు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దివాకర్రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్లో చికిత్స పొందారు.