Telangana | హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో నిజాం కాలంనాటి శాసనం బయటపడింది. అమ్రాబాద్ మండలం కోల్లంపెంట గ్రామ సమీపంలోని శివలింగంపై ఫార్సీ భాషలో చెక్కిన నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనుగొన్నది.
హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఉద్దౌలా బహదూర్ కొలువులోని జైన్చంద్ర అనే సుంకం అధికారి 1932 ఏప్రిల్ 9న దీనిని చెక్కించినట్టు చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. అక్కడి బంజరు భూమిలో మొక్కలు నాటించడం గురించి ఈ శివలింగంపై శాసనం చెక్కినట్టు ఆయన చెప్పారు. అదే లింగంపై తెలుగులో కూడా శాసనాలు చెక్కినట్టు పేర్కొన్నారు.