పెద్దఅంబర్పేట, జూన్ 10: స్నేహితులతో కలిసి పరీక్ష రాసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రావూరి అభిషేక్ (20) గుంతపల్లిలోని అవంతి కాలేజీలో పరీక్ష రాసేందుకు స్నేహితులు గన్నోజి రాఘవేంద్ర, దేవర గౌరవ్తేజ్తో కలిసి తన కారులో బయలుదేరాడు.
కారును రాఘవేందర్ నడుపుతున్నాడు. కాగా, కనకదుర్గనగర్, లష్కర్గూడ రోడ్ వద్దకు రాగానే రాఘవేందర్ అతివేగంగా వెళ్లడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న అభిషేక్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు.