వనపర్తి : వనపర్తి జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. ప్రేయసి పెండ్లికి నిరాకరించిందనే అక్కసుతో ప్రియుడు ప్రేయసి మెడకు చున్నీతో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఈ విషాదకర సంఘటన ఖిల్లా ఘనపూర్ మండలం మానాజీపేటలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శ్రీశైలం..హైదరాబాద్ మైలాదేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సాయిప్రియ( 19) ఇద్దరు గత 5 సంవత్సరాల నుంచి ప్రేమించు కుంటున్నారు. కాగా,గురువారం సాయిప్రియ శ్రీశైలంను కలిసేందుకు హైదరాబాద్ నుంచి మనాజీపేట్కు చేరుకుంది. ఇద్దరు కలసి గ్రామ శివారులోని కెనాల్ సమీపంలో మాట్లాడుకున్నారు.
ఈ క్రమంలో అమ్మాయి పెండ్లికి నిరాకరించడంతో శ్రీశైలం సాయి ప్రియ మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండాచేసి చంపాడు. సాయిప్రియ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు..పోలీసులు అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.