మల్యాల, మార్చి 21: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దుకాణాల లీజు వ్యవహారంలో గోల్మాల్కు సంబంధించి దేవాదాయశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ‘కొండగట్టు లీజులో గోల్మాల్’ అంటూ ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది.
ఈ క్రమంలో దేవాదాయ కమిషనర్ హన్మంతరావు ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ జ్యోతి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ కొండగట్టులో విచారణ చేపట్టారు. రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ సరిగా లేకపోవడం, విధుల్లో అలసత్వంప్రదర్శనకు పర్యవేక్షికుడితోపాటు సీనియర్ అసిస్టెంట్కు ఈవో టంకశాల వెంకటేశం మెమోలు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణను ఇవ్వాలని పేర్కొన్నారు.