హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో భూములు, బంగారం కాదు.. డాటా (వ్యక్తిగత సమాచారం) అనేది వీటికంటే అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు చెప్తున్న మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు. అందుకే వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంపిణీ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు చిన్న ఏమరపాటును అదునుగా చేసుకొని వ్యక్తిగత డాటా ఆధారంగా కేవలం ట్రై పోలీస్ కమిషనరేట్ల.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): అభయహస్తం దరఖాస్తులు నడిరోడ్డుపై దర్శనమివ్వడం.. డాటా ఎంట్రీలో అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘రోడ్డెక్కిన ప్రజాపాలన’ శీర్షికన వెలువడిన కథనం జీహెచ్ఎంసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీలో అసలు ఏం జరుగుతుందో అని అటు ప్రజలు, ఇటు అధికార వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. దీంతో దరఖాస్తులు రోడ్డున పడేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొన్నది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ఉదయమే జోనల్ కమిషనర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎల్బీనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ రవీందర్కుమార్ వ్యవహారంపై జోనల్ కమిషనర్ పంకజ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోన్లో డాటా ఎంట్రీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇదే సమయంలో అభయహస్తం దరఖాస్తులు బయటకు వెళ్లడం పట్ల జోనల్ కమిషనర్లను కమిషనర్ మందలించినట్టు తెలిసింది.
బాలానగర్ ఫ్లై ఓవర్పై దరఖాస్తులు పడటం, దరఖాస్తుల ట్రాన్స్పోర్టు విషయంలో నిర్లక్ష్యం వహించిన సర్కిల్-3కి చెందిన టీం లీడర్ వాల్యుయేషన్ ఆఫీసర్ ఎం.మహేందర్పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, అసలు బాధ్యులైన డిప్యూటీ కమిషనర్ రవీందర్కుమార్పై ఎలాంటి చర్యలు తీ సుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతున్నదని, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ రణజిత్తో విచారణ జరిపిస్తున్నామని, 24 గంటల్లో నివేదిక రాగానే తగిన చర్యలకు కమిషనర్కు నివేదిస్తామని జోనల్ కమిషనర్ పంకజ తెలుపడం గమనార్హం.
కుత్బుల్లాపూర్ సర్కిల్ 25కి చెందిన దరఖాస్తులను మంగళవారం డాటా ఎంట్రీ ఆపరేటర్లు తమ స్వంత వాహనంలో ఇంటికి తరలిస్తున్న అంశంలోనూ జోనల్ కమిషనర్ పంకజ స్పందించారు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ భార్గవ నారాయణ (టీం లీడర్)కు నోటీసులు జారీ చేశారు. అయితే, దరఖాస్తులను ఇంటికి తీసుకెళ్తున్నామని బహిరంగంగా డాటా ఎంట్రీ ఆపరేటర్లు చెప్పినా సదరు టీం లీడర్కు కేవలం నోటీసులతోనే సరిపెట్టడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డ భార్గవ నారాయణ జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్గా మారారు.
మాతృసంస్థకు పంపించాల్సిన సమయంలోనే కేవలం జీహెచ్ఎంసీలోనే ఆయనను ఇతర చోటుకు బదిలీ చేయడం, తాజా ఘటనలోనూ నోటీసుకే పరిమితం చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉం డగా, రోడ్డెక్కిన ప్రజాపాలన ఘటనపై సీఎంవో కార్యాలయం ఆరా తీసినట్టు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి ఉన్న సమయంలో కమిషనర్ రోనాల్డ్రోస్ సెక్రటేరియట్కు వెళ్లగా అక్కడ ఈ అంశంపై చర్చ వచ్చినట్టు సమాచారం. ప్రజాపాలన దరఖాస్తులపై పెద్ద రచ్చ జరగడంతో మొత్తంగా డాటా ఎంట్రీలో సర్కారు మున్ముం దు ఏ విధంగా వ్యవహరిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.