హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన హెల్త్కేర్ సేవల సంస్థ హెచ్సీఏ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో హెచ్సీఏ సేవలందిస్తుందని తెలిపారు. భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)లను ఏర్పాటు చేయాలనుకుంట్ను బహుళజాతి కంపెనీలు హైదరాబాద్కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని, రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులతోపాటు మెరుగైన మౌలిక వసతులు ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు.