ఘట్కేసర్ : భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్(Ambedkar) ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. ఆదివారం ఘట్కేసర్లో ప్రబుద్ధ భారత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని ప్రశంసించారు.
బడుగు, బలహీన, దళిత, గిరిజన ,అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షించి రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. నేటి యువత అంబేద్కర్(Ambedkar) ఆశయాలను, ఆచరణలను ప్రజలలో ప్రచారం చేసి మార్పు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, టీఎస్ఎస్జీడీసీఎఫ్ చైర్మన్ దుడిమెట్ల బాలరాజ్ యాదవ్, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ,ప్రబుద్ధ భారత్ ప్రతినిధులు,అంబేడ్కర్ సంఘాల నాయకులు,కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేస్తాం..
మేడ్చల్ కలెక్టరేట్ : మున్సిపాలిటీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మున్సిపాలిటీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ 4వ వార్డు బాలాజీ ఎన్క్లేవ్లో ఆదివారం మంత్రి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ముంపునకు గురికుండా తగిన చర్యలు తీసుకుంటామని, వరద నీటి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.