కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయం. ఆ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదురోవాలనే తాత్వికతకు డాక్టర్ బీఆర్ అంబేదర్ జీవితమే నిదర్శనం. అసమానతలు లేని ఆధునిక భారతదేశాన్ని ఆవిషరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హకులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేదర్.
ప్రపంచంలోనే మరెకడా లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేదర్ మహా విగ్రహాన్ని ఆయన జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణం. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్-3ను పొందుపరిచిన రాష్ట్ర బాంధవునికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది.
-సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని, ఆ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదురోవాలనే తాత్వికతకు డాక్టర్ బీఆర్ అంబేదర్ జీవితమే నిదర్శనమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదురొన్నా.. ఏనాడూ వెనుకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఆత్మన్యూనతకు, దుర్బలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచిస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేదర్ అని అభివర్ణించారు. సమాజంలో నెలకొన్న అజ్ఞానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి అని శ్లాఘించారు. సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన అంబేదర్.. ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హకులు, మతం, ఆర్థిక సంసరణలు, చరిత్ర, ఆర్థికవ్యవస్థతోపాటు అనేక అంశాలపై చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయని సీఎం వివరించారు. అసమానతలు లేని ఆధునిక భారతదేశాన్ని ఆవిషరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హకులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేదర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చి, నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేదర్ తన మేధస్సుతో మధించి సమకూర్చినవేనని సీఎం గుర్తుచేశారు.
ప్రపంచంలోనే మరెకడా లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేదర్ మహా విగ్రహాన్ని ఆయన జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్-3ను పొందుపరిచిన రాష్ట్ర బాంధవునికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది అని సీఎం వివరించారు. అంబేదర్ ఆశయాల కొనసాగింపులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టి ఆ మహనీయుడిని సమున్నతంగా గౌరవించుకున్నామని సీఎం వెల్లడించారు. అన్ని పథకాలతోపాటు సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు.
దళితుల కోసం గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేదర్ ఓవర్సీస్ సాలర్షిప్ ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీఎస్ప్రైడ్, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. అన్నివర్గాలకు అందుతున్న పథకాలతోపాటు, దళితుల జీవితాల్లో గు ణాత్మక మార్పే లక్ష్యంగా, వారికోసం ప్రత్యేకంగా తెచ్చిన ‘దళితబంధు’ పథకం దేశ చరిత్రలోనే విప్లవాత్మకంగా మారిందని తెలిపారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.10 లక్షల మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు ద్వారా అందించడంతోపాటు, భవిష్యత్తులో వారు ఎంచుకున్న వ్యాపారంలో ఒడిదొడుకులు సంభవించి, ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఆదుకొనేందుకు ‘రక్షణ నిధి’ ఏర్పాటుచేసి భరోసానిస్తున్నామని వెల్లడించారు. దశాబ్దాలుగా ఆత్మన్యూనతతో అసంఘటితంగా ఉన్న ఎస్సీ కుల సమాజం.. దళితబంధు పథకంతో సమిష్టిగా, సంఘటితమవుతూ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.