హైదరాబాద్ ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అంబేదర్ జయంతి రోజైన ఈ నెల 14న నిర్వహించనున్న అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బీఆర్ఎస్కే భవన్లో గురువారం సీనియర్ అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ అంబేదర్ విగ్రహావిష్కరణకు లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశమున్నదని తెలిపారు. ప్రధాన వేదిక వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేయాలని, ఆవరణ వద్ద సుందరీకరణ, మొబైల్ టాయిలెట్లు, ట్రాఫిక్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర వైద్య సహాయం కోసం అంబులెన్స్లనూ సిద్ధంగా ఉంచాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పారింగ్, ప్రాంగణం వద్ద ఏర్పాట్ల పటిష్ఠానికి శుక్రవారం సంయుక్తంగా సందర్శించాలని ఆర్అండ్బీ, పోలీస్, హెల్త్, సాంఘిక సంక్షేమ శాఖ, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఎస్సీడీడీ కమిషనర్ యోగితారాణా, సీడీఎంఏ సత్యనారాయణ, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెండోవిడత 3.38 లక్షల మంది పెంపకందారులకు గొర్రెలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు గురువారం గొర్రెల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. గొర్రెల సేకరణ, రవాణా, లబ్ధిదారుల వాటా డీడీల సీకరణ వంటి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. అత్యధిక లబ్ధిదారులున్న 12 జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా సంబంధిత టెండర్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్లో ప్రభుత్వం నిర్మించిన అంబేదర్ విగ్రహావిషరణకు కలెక్టర్లందరూ వారి జిల్లాల ప్రజలతో హాజరవ్వాలని సూచించారు.