వరంగల్ అర్బన్ : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం అంబాల, నెరేళ్ల గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువాలు కప్పి వీరందరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోల్కొండ నాగరాజ్, కోడెపాక శ్రీను, జి.చిరంజీవి, వి.పోచయ్య, జి.భాస్కర్, జి.వెంకటేష్, జి.పాని, గోల్కొండ రాజయ్య, జి.శ్రీనివాస్, బి.మురళి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ డా.సుధీర్ బాబు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జెడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.