హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది. 2021-22 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎడ్యుకేషన్ (యూడైస్) నివేదికను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా సెకండరీ విద్యలో 12.6 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారు. అంటే వీరంతా 10వ తరగతి పూర్తిచేయకుండానే చదువులకు గుడ్బై చెప్పారన్న మాట. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో సెకండరీ విద్యలో డ్రాపౌట్ రేటు జీరో. రాష్ర్టాల్లో హిమాచల్ప్రదేశ్లో 1.5 శాతంతో అతి తక్కువ డ్రాపౌట్ రేటు నమోదైంది. సెకండరీ ఎడ్యుకేషన్లో బాలుర డ్రాపౌట్ రేటు 13 శాతం ఉండగా, బాలికల డ్రాపౌట్ రేటు 12.3 శాతంగా ఉన్నది.