మహబూబ్నగర్ : వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం జానంపేట్ గ్రామానికి చెందిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
యాసంగి లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన నూనెగింజలు, మినుములు, అపరాలు తదితర పంటలు పండించాలన్నారు. గ్రామానికి చెందిన రైతు చంద్రయ్యను వరికి ప్రత్యామ్నాయంగా మినుములు వేసుకోవాలని సూచించగా.. స్పందించిన రైతు చంద్రయ్య వరికి బదులుగా మినుములు వేస్తానని ఎమ్మెల్యేతో అన్నారు.