హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల్లో 77 శాతం మంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 52.5 శాతం మంది పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్లు పొందారు. ఇటీవలే ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులో మొదటి విడతలో 70,665 మంది సీట్లు పొందారు. వీరిలో 54,467 మంది ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో సీట్లు పొందడం విశేషం. మరో 25,859 మంది పూర్తి ఫీజు రాయితీలో నయా పైసా చెల్లించకుండా అడ్మిషన్లు పొందారు. అంటే వీరందరికీ ఫీజులను ప్రభుత్వమే చెల్లించనున్నది. పాక్షిక ఫీజు రీయింబర్స్మెంట్ అంటే కాలేజీలో ఎంత ఫీజున్నా ప్రభుత్వం నుంచి రూ.రూ.35 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ పొందే వారు 28,598 (52.5 శాతం) ఉన్నారు. ఈ ఏడాది కేవలం 16,198 మంది ఫీజు రీయింబర్స్మెంట్తో నిమిత్తం లేకుండా ఇంజినీరింగ్ సీట్లు పొందారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఎంత ర్యాంకు వచ్చినా వారి పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇలాంటి వారు ఈ ఏడాది 11,555 మంది విద్యార్థులు పూర్తి ఫీజు రాయితీతో సీట్లను దక్కించుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ పూర్తిచేసి ఇంజినీరింగ్ సీట్లు పొందిన 11,822 మంది విద్యార్థుల ఫీజులనూ ప్రభుత్వమే భరించనున్నది.
10 వేలలోపు ర్యాంకు 25% మందికే..
ఎంసెట్లో 10 వేలలోపు ర్యాంకర్లలో కేవలం 25 శాతంలోపు విద్యార్థులు మాత్రమే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరారు. 75 శాతం విద్యార్థులు రాష్ట్రం దాటి ఐఐటీలు, ఎన్ఐటీలు సహా ్రప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది కేవలం 2,492 మంది మాత్రమే ఎంసెట్లో సీట్లను పొంది.. మన రాష్ట్రంలో చేరడం విశేషం.
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థుల వివరాలు
క్యాటగిరీ విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 11,555
ప్రభుత్వ కాలేజీల్లో
చదివిన వారు 11,822
10 వేలలోపు
ర్యాంకున్న వారు 2,492
మొత్తం 25,859