ప్రభుత్వానికి టీజీవోల వినతి
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): జిల్లా, జోనల్, మల్టిజోనల్ ఉద్యోగుల విభజన చేపట్టేకన్నా ముందే కొత్త జిల్లాలకు జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. టీజీవోల కేంద్ర సంఘం కార్యవర్గ అత్యవసర సమావేశం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు వీ మమత మాట్లాడుతూ.. 30 శాతం ఫిట్మెంట్తో తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే అత్యుత్తమ జీతాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు 95 శాతం ఉద్యోగాలు రాష్ట్ర యువతకే దక్కేలా నూతన జోనల్ విధాన్ని అమలు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల విభజనకు ముందే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరానికి తగ్గట్టు ఖాళీ పోస్టులను గుర్తించాలని, వాటి స్థానంలో నూతన పోస్టులను మంజూరు చేసి శాఖల వారీగా క్యాడర్ స్ట్రెంత్ను నిర్ణయించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, కోశాధికారి రవీందర్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు సహదేవ్, నగరశాఖ అధ్యక్షుడు జీ. వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, సభ్యులు రవీందర్రావు, మధుసూదన్ గౌడ్, అరుణ్కుమార్, బీ వెంకటయ్య, సుజాత, సబిత, పరమేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.