సంగారెడ్డి : అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. జిల్లాలోని జోగిపేట, అందోల్ మున్సిపాలిటీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మంత్రి కేటీఆర్ను కోరారు.
అందోల్, జోగిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. చిన్న మున్సిపాలిటీలు కావడంతో అభివృద్ధి కోసం వనరులు సమకూర్చుకోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు.
కమర్షియల్ complex నిర్మాణం జరిగితే అభివృద్ధి సులువుగా జరుగుతుందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తగుచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.