హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీటి కేటాయింపులు పూర్తయ్యేంత వరకూ కృష్ణా జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ను సవరించాలని సూచించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రూపొందించిన ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాకు కొన్ని సవరణలు సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది.
కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలోని ముఖ్యాంశాలు