శంషాబాద్ రూరల్, ఏఫ్రిల్ 10: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 9 విమాన సర్వీసులను అలయన్స్ ఎయిర్లైన్స్ సంస్థ రద్దు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి, బెంగళూరు, మైసూర్, విశాఖపట్నం వెళ్లాల్సిన విమానాలు, తిరుపతి, బెంగళూరు, చెన్నై, మైసూర్, గోవా నుంచి శంషాబాద్కు రావాల్సిన విమానాలను రద్దు చేసినట్టు ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. అంతర్గత సమస్యలతో సంస్థ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతోనే విమానాలను రద్దు చేసినట్టు ఎయిర్లైన్స్ తెలిపింది. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఎయిర్పోర్టుకు వచ్చి ఇబ్బందులు పడిన ప్రయాణికులకు టికెట్ల డబ్బులను సంస్థ తిరిగి చెల్లించింది.