ఖమ్మం వ్యవసాయం, జూలై 15 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ పంటకు మరోసారి ఆల్టైం రికార్డు ధర పలికింది. ఒకవైపు జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు వ్యాపారుల నుంచి మంచి ఆదరణ రావడం, కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వలు పూర్తిగా తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
దీంతో పక్షం రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.3 వేల పెరిగింది. అయితే ఇంతకాలం పంటను నిల్వ పెట్టుకొని యార్డులో అమ్మకానికి పెడుతున్న రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
శుక్రవారం జరిగిన జెండా పాటలో ఆయా జిల్లాలకు చెందిన రైతులు సుమారు 3,904 బస్తాలను అమ్మకానికి పెట్టారు. ఈ పాటలో కేసుపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు పంటకు రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.23,000 గరిష్ఠ ధర పలికింది.