కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 28 : గాజులరామారం డివిజన్, బాలయ్యబస్తీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బస్తీవాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే.. బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే.. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తో పాటు ఇతర సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించగా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.