మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటనున్నాయి. బుధవారం సాయంత్రం పట్టణంలోని మినీ ట్యాంక్బండ్పై మెగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. సాయంత్రం 5 గంటలకు రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుంచి బతుకమ్మలతో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారు. ర్యాలీలో కళాకారులు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
ప్రజలకు కనువిందు చేసేలా ట్యాంక్బండ్లో హంస వాహనం ఏర్పాటు చేశారు. దీంతోపాటు బాణాసంచా, లేజర్ షో నిర్వహించారు. బతుకమ్మ సంబురాలను చూసేందుకు జిల్లా కేంద్రంతో పాటు, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తరలిరానున్నారు.