Telangana | మల్లాపూర్, నవంబర్ 15: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం-శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన జంగం శేఖర్-రవీణ దంపతులు బీఆర్ఎస్పై ప్రత్యేక ఆదరణ చూపారు. ఎన్నికల నేపథ్యంలో ‘మా కుటుంబ సభ్యుల ఓట్లన్నీ బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకే వేస్తాం. దయచేసి మా ఇంటికి ఇతర పార్టీల నాయకులు రావొద్దు’ అని జంగం శేఖర్-రవీణ దంపతులు తమ ఇంటి గేటుకు ప్రత్యేకంగా రాసిన ప్రతాలను బుధవారం అతికించారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు.