హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నదని మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం హజ్కు వెళ్లే బస్సును హజ్ కమిటీ చైర్మన్ సలీం, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లను చేసినట్లు వారు పేర్కొన్నారు.