హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 7 నుంచి హజ్ యాత్రికుల ప్రయాణం మొదలుకానున్న నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని హజ్హౌస్లో కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశాఖ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
యాత్రలో అనుసరించాల్సిన నియమాలు, ప్రయాణ ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కమిటీ సభ్యులు సయ్యద్ నిజాముద్దీన్, సయ్యద్ గులాం అహ్మద్, జాఫర్ ఖాన్, ఇర్ఫాన్ ఉల్ హక్, కమిటీ ఈవో షఫివుల్లా, జాఫర్ పాషా, మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మౌలానా జియావుద్దీన్ నక్షిబందీ, మౌలానా అబ్రార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.