సిరిసిల్లా : రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్లా టెక్ట్స్టైల్పార్క్ కమాన్ ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ యూత్ జిల్లా నాయకుడు సిలివేరి చిరంజీవి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రైతు బంధు, రైతు బీమా కు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగుకు, బీసీలకు గతంలో మున్నెన్నడు లేనివిధంగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచి ఉపాధి కూలీలకు భరోసానిచ్చిందని ఆయన అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొంతినేని చందర్రావు కొక్కిరాల ఆగం రావు, పన్యాల శ్రీనివాస్ రెడ్డి, ఇమ్మనేని అమర్ రావు, చెన్నమనేని రాజేశ్వరరావు, గుంటి మహేశ్, శ్రీనివాస్, గుగ్గిళ్ల కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.