హైదరాబాద్: తెలంగాణ, మధ్యప్రదేశ్లోని హైపోథైరాయిడ్ రోగులకు అలర్ట్! రోగులు వినియోగించే ‘థైరోనామ్’ ట్యాబ్లెట్ల విషయంలో ఫార్మా కంపెనీ అబ్బాట్ ఇండియా అలర్ట్ జారీ చేసింది. డోసు విషయంలో ఒక బ్యాచ్ ట్యాబ్లెట్లలో 88 ఎంసీజీ డోస్ బదులు 25 ఎంసీజీగా తప్పుగా లేబుల్ (మిస్ లేబుల్డ్) పడిందని వెల్లడించింది. ఆ బ్యాచ్ ట్యాబ్లెట్లను కంపెనీ స్వచ్ఛందంగా వెనక్కి తీసుకొన్నది. ఈ ఏడాది మార్చిలో తయారైన బ్యాచ్ నంబర్ AEJ0713 థైరోనామ్ ట్యాబ్లెట్లను ఉపసంహరించుకొన్నట్టు తెలిపింది. థైరాయిడ్కు సంబంధిత రోగులు సరైన డోసు తీసుకోవాల్సిన నేపథ్యంలో తాము ఈ మిస్లేబుల్డ్ బ్యాచ్ ట్యాబ్లెట్లను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకొన్నామంది.