హైదరాబాద్: ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్లు తేవడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా కృషి చేసిందన్నారు. వైద్య రంగంలోనే ఇది సరికొత్త రికార్డ్ అని కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు.