సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్, బాల చెలిమి పుస్తకాల ప్రచురణ రాష్ట్ర కన్వీనర్ గరిపెల్లి అశోక్ ఆధ్వర్యంలో బాల చెలిమి సంస్థ ద్వారా తెలంగాణలోని ఉమ్మడి
10 జిల్లాల్లో బడి పిల్లల కథల పుస్తక సంకళనాలుగా తీసుకొచ్చారన్నారు.అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా బడి పిల్లల కథలు 18 వరకు ఉండగా, అందులో 15 వరకు సిద్దిపేట బడి పిల్లల రచనలకు చోటు దక్కడం సంతోషకరమ న్నారు. కథ సంకళనాలకు ఆలిండియా రేడియో అదిలాబాద్ ద్వారా ప్రచురితం కావడం అదృష్టమన్నారు. వారం రోజుల పాటు కవులు, బాలకవులు, ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమయ్యే కథలను వినాలని కోరారు.