హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : గాంధీ దవాఖానలో స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
గురువారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలివుల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర హైదరాబాద్లోని కార్యాలయంలో మాట్లాడారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటకు తేవాలనిలని డిమాండ్ చేశారు.