హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర 3వ మహాసభలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్టు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తెలిపారు.
గురువారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, అధ్యక్షుడు ఎస్ బాల్రాజ్ , కోశాధికారి ప్రేం పావని తదితరులతో కలిసి బోస్ మీడియాతో మాట్లాడారు. తొలిరోజు కార్మికులతో మహా ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్కౌర్ హాజరవుతారని పేర్కొన్నారు. 28, 29 తేదీ ల్లో ప్రతినిధుల మహాసభ జరుగుతుందని వెల్లడించారు.