హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ విమర్శించారు.
హైదరాబాద్లోని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.