హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల 31లోగా రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో పండ్లతోటల సాగును లక్ష్యంగా నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వర్షాప్లో 32 జిల్లాల నుంచి గ్రా మీణాభివృద్ధి, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ రైతులు అధిక మొత్తంలో ఆదాయం పొందడానికి వైవిధ్యభరితమైన పంటలు వేయడంలో మార్పు తీసుకురావాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఉపాధిహామీ పథకం, పీఎంకేఎస్వై ఉద్యానవన శాఖ నిబంధనల మేరకు పండ్ల తోటలు పెంచడానికి ముందుకొచ్చే రైతుల వివరాలను సేకరించాలని సూచించారు. హైదరాబాద్ సమీప జిల్లాల నుంచి రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎం హన్మంతరావు, స్పెషల్ కమిషనర్లు ప్రసాద్, ప్రదీప్శెట్టి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ మహిళలకు ‘క్యాంటీన్’ శిక్షణ
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 150 మంది దివ్యాంగులైన ఎస్హెచ్జీ మహిళల శిక్షణ శిబిరాన్ని శుక్రవారం మంత్రి నిథమ్లో ప్రారంభించారు. 20 రోజుల శిక్షణ అనంతరం జిల్లాల్లో వీరి చేత క్యాంటీన్లను ఏర్పాటు చేయిస్తారు. దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. దివ్యాంగులకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తున్నదని వివరించారు. దివ్యాంగుల పింఛన్ను రూ.4 వేలకు పెంచామని, దేశంలోనే వారికి అత్యధికంగా పింఛను ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ఈ శిక్షణ ద్వారా ప్రతి ఒకరూ ఈ రంగంలో నిష్ణాతులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సెర్ప్ డైరెక్టర్ వై నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.