చండ్రుగొండ, ఆగస్టు 9: ఏసీబీ దాడుల్లో మండల వ్యవసాయాధికారి పట్టుబడిన ఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఫెర్టిలైజర్స్ యజమానులతో ఏవో నార్లపాటి మహేశ్చంద్ర చటర్జీ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి, ప్రతి యజమాని రూ.15 వేలు లంచం ఇవ్వాలని మెస్సేజ్ పెట్టాడు. సదరు షాపుల యజమానులు నేరుగా కలిసి డబ్బులు ఇస్తామని ఏవోకు సూచించారు. సోమవారం మండలంలోని అయ్యన్నపాలెం రైతువేదికలో వ్యాపారుల నుంచి ఏవో రూ.90 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.