వనపర్తి రూరల్, నవంబర్ 12 : యాసంగి సీజన్లో పంటల సాగు కోసం డిసెంబర్లోనే రైతుబంధు సాయం అం దజేస్తామని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి పాల్గొన్నారు.