చేర్యాల/ సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో చివరి వారమైన 13 ఆదివారం సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిసెంబర్ మాసంలో స్వామి వారి కల్యాణోత్సవంతో ప్రారంభమైన స్వామి వారి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాల కార్యక్రమంతో ముగుస్తాయి. స్వామి వారి క్షేత్రంలోని కల్యాణ వేదిక అవరణలో అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తిశ్రద్దలతో నిర్వహించనున్నారు.
కాగా, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ సంప్రదాయం మేరకు నిర్వహించేందుకు ఆలయవర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనా నేపథ్యంలో భక్తులకు ఈసారి అగ్నిగుండాల ప్రవేశానికి అనుమతి లేదని ఆలయ ఈవో ఏ.బాలాజీ బుధవారం తెలిపారు. అలయ అర్చకులతో ఉత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?