బంజారాహిల్స్, ఏప్రిల్ 19: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అధికారులకు స్థానికులు మరోసారి ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్లోని తన నివాసం వెనుకాల రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి రాగా షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలను తొలగించి నాలుగురోజుల క్రితం స్థలాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రెవెన్యూ సిబ్బంది తొలగించిన బ్లూషీట్లను శుక్రవారం తిరిగి ఏర్పాటు చేసి స్థలాన్ని ఆక్రమించుకోవడంతో స్థానికులు మళ్లీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారులు ఆక్రమణలను తొలగించినా మళ్లీ బ్లూషీట్లు ఏర్పాటు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను స్థలాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకుంటున్నానంటూ మీడియా ముఖంగా దానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.