హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్లో అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్పీఐ) ఆధ్వర్యంలో సదస్సు జరుగనున్నది.
ఏఎఫ్పీఐ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల స్థాయిలో ఈ సదస్సు నిర్వహిస్తారు. ముఖ్య అతిథిగా మాజీ సీజేఐ ఎన్వీ రమణ హాజరయ్యే సమావేశంలో తెలుగు రాష్ర్టాల్లో ఫ్యామిలీ మెడిసిన్పై చర్చించనున్నారు.