నీ ధాన్యం మొత్తం కొంటాం: హరీశ్రావు
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో ఓ మహిళ చేయిపట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ‘మామూలు ధాన్యానికి ఇచ్చినట్టుగానే.. తడిసిన ధాన్యానికీ మద్దతు ధర చెల్లించి.. నీవు పండించిన ప్రతి గింజనూ కొంటాం. అధైర్యపడొద్దు’ అని మంత్రి ఆమెకు భరోసా ఇచ్చారు.
-సిద్దిపేట అర్బన్
అవ్వా.. అధైర్య పడకు : శ్రీనివాస్గౌడ్
పాలమూరు మార్కెట్ యార్డులో పట్టణ మహిళా స మాఖ్య, ఎదిరలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. మార్కెట్ యార్డులో పనిచేస్తున్న లక్ష్మమ్మను మంత్రి ఆప్యాయంగా హత్తుకొని పలుకరించారు. అవ్వ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
-మహబూబ్నగర్ మెట్టుగడ్డ/పాలమూరు