మెండోరా, ఏప్రిల్ 27: నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. 2,748 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు.
ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 50 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (91.03 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1065.30 అడుగుల (20.226 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదని ఆయన పేర్కొన్నారు.