హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ ఆన్లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఇంజినీరింగ్ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఉదయం, మధ్యా హ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ జనార్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. హాల్టికెట్లను పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్సైట్లో పొందుపరుస్తామని అనితారామచంద్రన్ పేర్కొన్నారు. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్ను 2022 సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం విదితమే.