హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది కరణం శ్రవణ్కుమార్ నియమితులయ్యారు.
అడ్వకేట్ ఆన్ రికార్డ్గా దేవిన సెహగల్, తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా దివ్య ఆడెపు నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ శాఖ శనివారం వేర్వేరుగా జీవోలు జారీచేసింది. వీరంతా ఆయా పదవుల్లో మూడేండ్లపాటు కొనసాగనున్నారు.