సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 8: నావిగేషన్ టెస్టింగ్ సౌకర్యాల పరిశోధన, అభివృద్ధిలో ముందడుగు పడింది. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ (నాబ్) నేతృత్వంలో ఏర్పా టు చేసిన నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (నాట్రాక్స్) అనేది ప్రపంచ స్థాయి ఆటోమోటివ్ సంస్థకు స్థానిక ఐఐటీ హైదరాబాద్కు మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. ఈ మేరకు నాట్రాక్స్ ప్రతినిధులు, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
సాంకేతిక నైపుణ్యం, శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలతోపాటు ఆటోమోటివ్ పరిశ్రమ, అదేవిధంగా అడాస్ అవసరాలకు అనుగుణంగా అధునాతన నైపుణ్యాలను అందించడం, మార్గదర్శకత్వం చేయడం ద్వారా ఆటోమేటెడ్ డ్రైవింగ్లో పనిచేసేందుకు పరిశ్రమ సహకారం ద్వారా ఈ రంగంలో మానవ వనరులను పెంపొందించడం ఈ ఒప్పంద సహకారం లక్ష్యమని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వెల్లడించారు.