హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నీట్, ఎంసెట్తోపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నందున మైనార్టీలకు సర్టిఫికెట్లను తహసీల్దార్లు వేగంగా మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
తహసీల్దార్లు తమకు వచ్చిన దరఖాస్తులను వేగంగా తనిఖీ చేసి, సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించింది. దరఖాస్తుదారులు ఎందుకోసం సర్టిఫికెట్ అడుగుతున్నారో తెలుపాలని చెప్పింది. తనిఖీ సమయంలో గతంలో మంజూరు చేసిన కులం సర్టిఫికెట్ లేదా పదో తరగతి టీసీలో పొందుపరిచిన జాతీయతను, నీట్ లేదా ఎంసెట్ వంటి పోటీపరీక్షల అడ్మిట్/ర్యాంకు కార్డుల్లోని జాతీయతను, లేదా ఆధార్/రేషన్ కార్డుల్లో పొందుపరిచిన జాతీయతను ఆధారంగా చేసుకోవాలని తహసీల్దార్లకు సూచించింది.