ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య రెట్టింపు అవడం తనకెంతో ఆనందాన్నిస్తున్నదంటూ ట్వీట్ చేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అధికారుల బృందాన్ని మంత్రి అభినందించారు. ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది 61,129 మంది విద్యార్థులు ప్రైవేట్ సూళ్లను వదిలి సరారు బడుల్లో చేరారు. మొత్తం 1,69,280 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ వార్త పత్రికలో ప్రచురితమైన కథనాన్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్తో పాటు పంచుకొన్నారు.