హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం గురువారం నిర్వహించతలపెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కలెక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వివరించాలని సీఎం భావించారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ సమాచారం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలుండటం, సీఎం ఢిల్లీకి వెళ్లనుండటం తో సమావేశాన్ని రద్దు చేశారు.
సీఎం ఢిల్లీ పర్యటనా వాయిదా
సీఎం రేవంత్ గురువారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.