ఎదులాపురం, నవంబర్ 14: ఆదిలాబాద్లో ఓ బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న ఫొటోను రాక్షసుడి లాగా మార్ఫింగ్ చేసి, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బాణం వేసి సంహరిస్తున్నట్టు చిత్రీకరించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పద్మావర్ రాకేశ్ తన ఫోన్లో జోగు రామన్న, పాయల్ శంకర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
రెండు కులాలు, పార్టీల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టించడానికి ప్రయత్నించాడు. స్థానికుడు వాగ్మారే ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేశ్పై వన్ టౌన్లో కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.