ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ గులాబీ పరిమళం రాష్ట్రమంతా గుబాళిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు ఎక్కడ చూసినా ‘జై తెలంగాణ’ నినాదం మార్మోగుతూ ప్రత్యర్థుల గుండెలను ఛిద్రం చేస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎంగా చూడాలని కలలుకంటున్న ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులకు లభిస్తున్న ప్రజాదరణ ముందు ప్రత్యర్థి పార్టీలు వెలవెలబోతున్నాయి.
ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ గెలుపు ఖాయం కాగా, ప్రత్యర్థులు రెండుమూడు స్థానాల కోసం పోటీపడుతున్నారు. ఓవైపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు ప్రజలతో కిక్కిరిసిపోతుండగా, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సుడిగాలి పర్యటనలు ప్రజల్లో ఊపుతెస్తున్నాయి. బీఆర్ఎస్ గెలుపును ఏకపక్షం చేస్తున్నాయి.
నాడు ఎట్లుండె తెలంగాణ.. నేడు ఎట్లయిందో చూడాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణను అభివృద్ధి పథాన నడుపుతూ, తెలంగాణకు అంతర్జాతీయ కీర్తి సంపాదించిపెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే తమ మద్దతంటూ తెలంగాణ ప్రజ ఒక్క గొంతుకై నినదిస్తున్నది. మేమంతా మీవెంటే నడుస్తామంటూ కోట్ల గొంతులు ఉప్పెనై చెబుతున్నాయి. ఆ ధ్వనిప్రవాహంలో ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమైంది.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ
వనపర్తి నియోజకవర్గం నుంచి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రెండోసారి పోటీలో ఉన్నారు. 2018లో విజయఢంకా మోగించిన ఆయన వనపర్తి నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. వనపర్తిలో వందేండ్ల కరువును పారదోలే విధంగా మినీ లిఫ్టులు ఏర్పాటు చేసి రిజర్వాయర్లతో నింపేశారు. జిల్లాలో తాగునీటి గోస తీర్చేందుకు ఏకంగా రూ.300 కోట్లతో ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటు చేసి తాగునీళ్లకు ఢోకా లేకుండా చేశారు. జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణతో రూపురేఖలే మారిపోయాయి. ఆయన చేసిన అభివృద్ధే రెండోసారి గెలుపునకు బాటలు వేయనుంది.
2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మంత్రి శ్రీనివాస్గౌడ్కే పాలమూరు జై కొట్టనున్నది. హ్యాట్రిక్ విజయం ఖాయంగా కనిపిస్తున్నది. జిల్లాలో ఐటీ హబ్, అమర్రాజా కంపెనీ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు, సుమారు రూ.5,000 కోట్లతో మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పాలమూరులో ఇప్పుడు రోజూ కృష్ణా జలాలతో అందుతున్నాయి.
మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చిట్టెం రామ్మోహన్రెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. 2014లో గెలుపొంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆయన ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి మక్తల్ను అగ్రస్థానంలో నిలిపారు. మక్తల్లో రైల్వే స్టేషన్, 150 పడకల దవాఖాన, ఫైర్ స్టేషన్ నిర్మాణం, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి రూ.కోట్లతో పట్టణాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
2014, 2018 ఎన్నికల్లో వరుస విజయం సాధించిన ఎస్ రాజేందర్రెడ్డి ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తేలింది. కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న నారాయణపేట నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడం, మెడికల్ కాలేజీ రావడంతో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి కూడా రాజేందర్రెడ్డికే నారాయణపేట ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఓటర్లు ప్రకటిస్తున్నారు. ఈసారి గెలిస్తే పరిశ్రమలు తెస్తామని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా రాజేందర్రెడ్డి విజయం ఖాయంగా కనిపిస్తున్నది.
చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర తిరగరాయనున్నది. 2014, 2018 ఎన్నికల్లో నెలకొల్పిన రికార్డును ఈసారి బద్దలు కొట్టబోతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చెన్నూరు ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి పరుగులు తీసింది. ఇది ఆయనకు కలిసిరానున్నది.
నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఎదురులేదు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి ఆయన గెలుపొందారు. అభివృద్ధి పనులు బీఆర్ఎస్కు ప్లస్పాయింట్గా మారా యి. జిల్లా ఏర్పాటుతోపాటు, నిర్మల్లో రూ.5.18 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రూ.5.20 కోట్లతో ఫుట్పాత్ల నిర్మాణం, రూ.2 కోట్లతో హైమాస్ట్ లైట్లు, రోడ్ల విస్తరణతో నిర్మల్ రూపురేఖలు మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్రెడ్డిని ఇవే విజయతీరాలకు చేర్చనున్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నరు. 2014, 2018లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆయనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉద్యమ సమయంలో ఈ నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ కరివెన రిజర్వాయర్ను దగ్గరుండి డిజైన్ చేయించారు. నియోజకవర్గంలో అత్యధిక చెక్ డ్యాములను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే నీటిని ఒడిసిపట్టారు. అందుకే కేసీఆర్ సైతం చెక్ డ్యాముల ఆలన్న అంటూ సంబోధించారు. ఈసారి కూడా ఆలన్నకే దేవరకద్ర జై కొట్టబోతున్నది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి పదవిని త్యాగంచేసిన జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డికే ప్రజలు మళ్లీ పట్టం కట్టబోతున్నారు. 2014, 2018లో వరస విజయాలు అందించిన జడ్చర్ల ప్రజలు ముచ్చటగా మూడోసారి లక్ష్మన్నను అక్కున చేర్చుకోనున్నారు. పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో అభివృద్ధి సాధించిన జడ్చర్ల పట్టణానికి రూ.వందల కోట్ల నిధులు తీసుకువచ్చారు. 2000 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందించారు. అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలతో లక్ష్మారెడ్డి ప్రజలకు చేరువయ్యారు.
అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయుడు పోటీలో ఉన్నారు. రాజకీయాలకు కొత్త అయినా హేమాహేమీలను ఎదుర్కొనబోతున్నారు. అలంపూర్లో 100 పడకల దవాఖాన, నందిన్నె వద్ద తుంగభద్ర నదిపై హైలెవల్ వంతెనలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడం వంటి అభివృద్ధి పనులు ఆయనకు వరంగా మారాయి. అలంపూర్ అభివృద్ధి జరగాలంటే విజేయుడికి పట్టం కట్టాలని కేసీఆర్ పిలుపుతో అలంపూర్ ఒక్కటైంది.
2018లో విజయం సాధించి రెండోసారి బరిలోకి దిగారు బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పట్టణ రూపురేఖలే మా రిపోయాయి. జిల్లాకు మెడికల్ కాలే జీ, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేశా రు. 2000 డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అందించారు. గద్వాల ప్రజ లు మరోసారి బండ్లకు పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. ఆయనకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్రెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. అభివృద్ధి నినాదంతో పార్టీ మారిన ఆయన బీఆర్ఎస్లో చేరి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని బీరం సాధించి చూపించా రు. సింగోటం ఆలయాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. అభివృద్ధికి బా టలు వేసిన హర్షవర్ధన్రెడ్డి ఈసారి కూడా గెలవబోతున్నారు.
అచ్చంపేట నుంచి గువ్వాల బాలరాజ్ మూడోసారి బరిలోకి దిగారు. మూడోసారి కూడా ఆయనకే జై కొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. రూ.వందల కోట్లతో చేసిన అభివృద్ధి ఆయనకు అండగా నిలబడుతున్నది. నల్లమల బిడ్డల కల అయిన ఉమామహేశ్వరం లిఫ్ట్ను సాధించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో భూములకు నీరు పారుతుంది. ప్రభుత్వం గిరిజనులకు అందించిన పోడు పట్టాలు అందించడంతో గిరిజనుల మద్దతు కూడా ఆయనకు సంపూర్ణంగా ఉంది.
నాగర్కర్నూల్ నుంచి మూడోసారి బరిలోకి దిగిన మర్రి జనార్దన్రెడ్డికి విజయం అందించాలని ప్రజలు కూ డబలుక్కున్నారు. వందల కోట్లతో ఆయన పట్ణ స్వరూపాన్ని మార్చి వేశారు. హైదరాబాద్ ట్యాంక్బండ్ తరహాలో నాగర్కర్నూల్లో ట్యాంక్బండ్ నిర్మించి మధ్య లో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నది. సొంత డబ్బులతో ప్రభుత్వ బడి కట్టించి కా ర్పొరేట్ స్థాయివిద్యను అందిస్తున్నారు. ఈ సారికూడా ప్రజలు మర్రికి పట్టం కట్టబోతున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్యాదవ్ రెండోసారి బరిలో ఉన్నారు. గతం లో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన బీఆర్ఎస్లో చేరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. జైపాల్ యాదవ్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
బెల్లంపల్లి గులాబీపల్లి కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకుతోడు ఆ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్న య్య ప్రజల తలలో నాలుకలా ఉం డడంతో ముచ్చటగా మూడోసారి ఇక్కడ గులాజీ జెండా ఎగరడం ఖాయమైంది. 100 పడకల దవాఖాన అందుబాటులోకి రావడం వల్ల తమకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల గడ్డ మీద గులాబీ జెండా మరోసారి ఎగరనున్నది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మంచిర్యాల బీఆర్ఎస్ వెంటే ఉన్నది. 2009, 2010, 2014, 2018 ఇలా వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్నది. ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు ఎన్నికల్లోనూ గెలిచి తీరుతారనే అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. దివాకర్ హయాంలోనే మంచిర్యాల జిల్లా అయిందని, ఎవరూ చేయలేని అభివృద్ధి చేశారని సీఎం కేసీఆర్ చెప్పడం ప్లస్ పాయింట్గా మారింది.
ఉద్యమ కాలం నుంచి ఆదిలాబాద్ ప్రజలు గులాబీ పార్టీకి అండగా నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం బాగా కలిసివస్తున్నది. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలిచారు. ప్రభుత్వ వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు యువతను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. నిర్మాణం అవుతున్న ఐటీ టవర్, చనాక- కొరాట ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
గత రెండు ఎన్నికల్లోనూ ముథోల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డి గెలుపొందారు. అనేక సమస్యలు బీఆర్ఎస్ హయాంలో పూర్తవడంతో ప్రజలంతా విఠల్రెడ్డి వెంటే ఉన్నారు. ఇటీవల ముథోల్లో నిర్వహించిన సభలో గడ్డెన్నవాగును 12 వేల ఎకరాలకు పెంచుతామని, బాసర ఆలయానికి మరిన్ని నిధులు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
పదేండ్లుగా ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురనేది లేకుండా పోయింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతున్నది. నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇటీవల కొత్త మండలాల ఏర్పాటు, ఖానాపూర్ను మున్సిపాలిటీగా మార్చడంతోపాటు ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభించింది. ఈసారి కొత్తగా యువకుడు, కేటీఆర్ మిత్రుడు జాన్సన్నాయక్కు టికెట్ ఇవ్వడం కూడా బీఆర్ఎస్కు కలిసివస్తున్నది.
బోథ్ ప్రజలు ఉద్యమకాలం నుంచీ బీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు. 2014, 2018 రెండుసార్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు మరోమారు గెలుపును ముద్దాడనుంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న అనిల్జాదవ్ వివాదరహితుడు. పోడుపట్టాల పంపిణీ, తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయతీలు చేయడం, బీఆర్ఎస్ సంక్షేమం, అభివృద్ధి పథకాలు పార్టీకి అనుకూలంగా మారాయి. అనిల్జాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన సానూభూతి కూడా ఉంది.
కాగజ్నగర్ సిర్పూర్ నియోకవర్గం ఓటర్లు ముందు నుంచి బీఆర్ఎస్కే అండగా నిలబడుతున్నారు. నియోజకవర్గంలో చుతుర్ముఖ పోటీ నెలకొన్నప్పటికీ బీఆర్ఎస్కు అనుకూలించనుంది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సిర్పూర్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంతోపాటు కోనేరు ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు ఆయనకు కొండంత అండగా నిలుస్తున్నాయి.
ఆదివాసీ గిరిజన క్షేత్రమైన ఆసిఫాబాద్ బీఆర్ఎస్కు ఆదినుంచి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి పోటీచేస్తున్నారు. ముక్కోణపు పోటీలో బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. బీఆర్ఎస్ ఆసిఫాబాద్ను జిల్లా చేసింది. మెడికల్ కాలేజీ మంజూరుచేసింది. కుమ్రం భీం స్మారక స్థూపాన్ని నిర్మించింది. పోడుట్టాలిచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ గెలుపుకు దోహదపడనున్నాయి. ఇక్కడ ఆదివాసీలు 85వేలకు పైగా ఉండడంతో వార్ వన్సైడ్ అయ్యింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి.
ఈనెల 19న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు ఇసుకేస్తే రాలనంతగా హాజరైన ప్రజలు