Adilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు పాత కలెక్టరేట్ భవనం కుప్పకూలిపోయింది. పాత భవనంలో కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖలు పనిచేస్తున్నాయి. ట్రెజరీ కార్యాలయంలోని పాతబడిన పైకప్పు భారీ వర్షానికి ఒక్కసారిగా విరిగిపడింది. ట్రెజరీ కార్యాలయం ముందు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కార్యాలయం ఆవరణలోని ర్యాకులపై పైకప్పు పడడంతో అందులోని ఫైల్ సైతం ధ్వంసమయ్యాయి. జిల్లా పర్యటనలో ఉన్న ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలెక్టరేట్లో సమావేశానికి వచ్చే సమయానికి ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం సమయం కావడంతో కార్యాలయం సిబ్బంది, జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.